‘నేను’ పేరుతో తన జీవిత అనుభవాలను ఓ పుస్తకంగా రాసి ప్రచురించారు బ్రహ్మానందం. తాజాగా దీనిపై చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘నాకు అత్యంత ఆప్తుడు, ఎన్నో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులందరికీ ఆనందాన్ని అందించిన వ్యక్తి మనందరి బ్రహ్మానందం. 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో తాను కలిసిన వ్యక్తులు, పరిచయాలు, తెలుసుకున్న విషయాలు, దృష్టికోణాలు, తనకు ఎదురైన ఎన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా పుస్తకం తీసుకొచ్చారు. ఒకరి అనుభవం, మరొకరికి పాఠ్యాంశం, మార్గదర్శకం కావొచ్చు. చదివే ప్రతిఒక్కరికీ ఈ పుస్తకం వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తుంది.’ అని ట్విట్టర్లో రాసుకొచ్చారు. ఈ పుస్తకం అమెజాన్, ఫ్లిప్కార్ట్ అందుబాటులో ఉంది.