స్విమ్మింగ్‌ పూల్‌లో పడి బాలుడు మృతి

Apr 16,2024 16:10 #Boy dies, #swimming pool

హైదరాబాద్‌ : సనత్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్‌ పూల్‌లో పడి కార్తికేయ(12) అనే బాలుడు మఅతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. స్నేహితులతో కలిసి క్రికెట్‌ ఆడుతుండగా బాల్‌ వెళ్లి స్విమ్మింగ్‌ పూల్‌లో పడింది. బాలు తీసుకు రావడానికి గోడ దూకి వెళ్లిన కార్తికేయ ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతోస్నేహితులు కార్తికేయ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి చూడగా స్విమ్మింగ్‌ పూల్‌లో కార్తికేయ విగతజీవిగా కనిపించాడు. కాగా, నిన్న స్విమ్మింగ్‌ పూల్‌ బంద్‌ ఉండడంతో తనని ఎవరు గమనించలేకపోయారని తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కార్తికేయ మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️