జాతీయ స్థాయి పోటీలకు అండర్ 17, 19 జట్లు

Jan 1,2024 15:13 #Vizianagaram
boxing sports persons going to national

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అండర్ 17, 19 బాక్సింగ్ రాష్ట్ర  ఆంధ్రప్రదేశ్ టీములు జాతీయస్థాయి పోటీలలో పాల్గొనుటకు ఢిల్లీకి సోమవారం బయలుదేరి వెళ్ళాయి. ఈ పోటీలు జనవరి 3 నుంచి 8 తేదీ వరకు ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో జరుగనున్నాయి. మొత్తం రెండు విభాగాలలో కలిపి 27 మంది క్రీడాకారులు మరియు కోచ్, మెనేజర్లుగా నలుగురు వ్యాయామ ఉపాధ్యాయులు వెళుతున్నారు. ఈ క్రీడాకారులను జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కన్వీనర్, జిల్లా విద్యాశాఖ అధికారి బి.లింగేశ్వర రెడ్డి, ఉప విద్యాశాఖ అధికారి కె.వాసుదేవరావు, జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎల్.వి. రమణ, జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డోల మన్మధ కుమార్ అభినందనలు తెలియజేశారు.

➡️