– ఎపి జెఎసి అమరావతి
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : విజయవాడలోని గాంధీనగర్ జింఖానా గ్రౌండ్లో ఈ నెల 10న జరగనును అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని ఎపి జెఎసి అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, స్టేట్ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె సుమన్ కోరారు. విజయవాడలో రెవెన్యూ భవన్లో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఏకం చేసి ఒక సంఘంగా ఏర్పాటు చేయాలని ప్రథమ మహాసభ సందర్భంగా రాష్ట్ర కమిటీ ఎనిుక నిర్వహించిందన్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తును అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో కొందరిని నేటికీ ఆప్కాస్లో చేర్చలేదన్నారు. ఈ సమావేశంలో ఎపి జెఎసి అమరావతి రాష్ట్ర నాయకులు వివి మురళీకృష్ణనాయుడు, బి కిశోర్ తదితరులు పాల్గొన్నారు.