అమరావతి: మద్య నిషేధంపై సీఎం జగన్ హామీ ఇచ్చి అదే మద్యంపై రూ.లక్ష కోట్లు సంపాదించారని టిడిపి నేత బొండా ఉమా విమర్శించారు. ఎన్టీఆర్ భవన్లో బిజెపి నేత లంకా దినకర్, జనసేన నేత గాదె వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మద్యం, గంజాయి రెండూ ఆయనకు ఆదాయ వనరులని విమర్శించారు. తప్పులు చేసిన అధికారులు కోర్టుల్లో నిలబడక తప్పదని హెచ్చరించారు.
మద్యంపై జగన్కు ఆదాయం కిక్కు.. పేదల ప్రాణాలకు ముప్పు ఉందని బిజెపి నేత లంకా దినకర్ అన్నారు. మద్యంలో రూ.లక్షల కోట్లు దోచేసి సూట్కేసు కంపెనీలకు తరలించారని ఆరోపించారు. మేనిఫెస్టోను జగన్ తుంగలో తొక్కారని జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు అన్నారు. మద్య నియంత్రణను తమ కూటమి సాధ్యం చేసి చూపిస్తుందని చెప్పారు.