రక్తదానం చేసి ప్రాణ దాతలు కావాలి

Mar 29,2024 17:49 #Kadapa

ప్రజాశక్తి – వేంపల్లె : ప్రమాదాల్లో గాయపడి రక్తం కోసం ఎదురు చూస్తున్న వారి కోసం ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని వైకాపా నేత సతీష్ కుమార్ రెడ్డి, జడ్పీటీసీ రవికుమార్ రెడ్డిలు కోరారు. స్థానిక ఆర్ఎంఎస్ వీధిలో వైకాపా నేత మదార్ షా వలి ఆధ్వర్యంలో ఖూన్ కా రిస్తా సహకారంతో శుక్రవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వైకాపా నేత సతీష్ రెడ్డి, జడ్పీటీసీ రవికుమార్ రెడ్డిలు ప్రారంభించారు. అలాగే రక్త దానం చేసిన దాతలు అందరికి ఖూన్ కా రిస్తా సోస్తెటీ అందజేసిన సర్టిఫికెట్లును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న వారంతా ఎలాంటి అపోహలకు గురి కాకుండా రక్తదానం చేయవచ్చు అన్నారు. యవత రక్తదాన శిబిరాన్ని ఖూన్ కారిస్తా సహకారంతో ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. భవిష్యత్తులో మరిన్ని రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్త నిల్వలు పెంచేందుకు కృషి చేయాలని కోరారు. రక్తదానం చేసేందుకు యవత ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్ చంద్రఓబుల్ రెడ్డి, సివిల్ సప్లయ్ డైరెక్టర్ షబ్బీర్ వలి, హజ్ హౌస్ డైరెక్టర్ మునిర్, షాదీఖానా కమిటీ అధ్యక్షుడు బిఎస్ షెక్షావలి, ఎంపిటిసిలు భారతి, రహంతుల్లా ఖాన్, ఖూన్ కారిస్తా సభ్యులు సమీర్, మదార్ షా వలి, హబిబ్, సింగపూర్ సుబ్బారెడ్డి, వార్డు మెంబరు ముత్యాల ఆంజనేయులు, రోహన్ నాగిరెడ్డి, తుషార్ నాగిరెడ్డి, రసూల్ తో పాటు వైకాపా నేతలు పాల్గొన్నారు.

➡️