అంధులు మనోధైర్యంతో ముందుకు సాగాలి : మేయర్‌ వసీం

Jan 4,2024 15:24 #Anantapur District

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : అంధులు మనోధైర్యంతో ముందుకు సాగాలని నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం పేర్కొన్నారు. లూయీస్‌ బ్రెయిలీ 215వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంధుల మధ్య కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా మేయర్‌ వసీం మాట్లాడుతూ.. అంధుల ఆరాధ్య దైవం, గురువుగా లూయీస్‌ బ్రెయిలీ గుర్తింపు పొందారన్నారు. అంధులకు లిపి కనుగొని వారి విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి లుయీ బ్రెయిలీ అని కొనియాడారు. లూయిబ్రెయిలీ స్వశక్తి, పట్టుదలతో అంధులు చదివేందుకు బ్రెయిల్‌ లిపి తయారు చేశారని, అంధులు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చునన్నారు. దివ్యాంగ విద్యార్థులు బ్రెయిలీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డైరెక్టర్‌ రసూల్‌, కార్పొరేటర్లు అనిల్‌ కుమార్‌ రెడ్డి, ఇషాక్‌, వైసీపీ నాయకులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

➡️