గీతకు మద్దతుగా బైక్‌ ర్యాలీ

May 8,2024 21:33

 ప్రజాశక్తి-విజయనగరం కోట : తాను చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మరోసారి తనకు ఎమ్మెల్యేగా అవకాశమివ్వాలని స్వతంత్ర అభ్యర్థి మీసాల గీత అన్నారు. ఆమెకు మద్దతుగా నగరంలో బుధవారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. తన ఇంటి వద్ద ప్రారంభమైన ర్యాలీ విటి అగ్రహారం, అయ్యన్న పేట, బిసి కాలనీ గుండా సాగింది. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ తాను స్వార్థం కోసం కాకుండా సేవా భావంతో పోటీ చేస్తున్నానని తెలిపారు. విద్య వైద్య ఆరోగ్య సౌకర్యాలు కోసం కృషి చేస్తానన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతానని తెలిపారు.

➡️