బుట్టాయిగూడెం (ఏలూరు) : రెండు బైక్లు ఒకదానినొకటి ఢీకొట్టుకోవడంతో వ్యక్తి మృతిచెందిన ఘటన మంగళవారం ఏలూరు జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం రాజానగరం వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న కోపల వెంకటరెడ్డి (30) అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.