కోల్‌కతా ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం..

Mar 27,2024 18:54 #airports, #flight crash, #Kolkata
  •  రన్‌వేపైకి ఒకేసారి రెండు విమానాలు..

కోల్‌కతా : కోల్‌కతా ఎయిర్‌పోర్టులో పెను ప్రమాదం తప్పింది. ఒకే రన్‌ వేపైకి రెండు విమానాలు రావడంతో ఒకదానికొకటి ఢకొీన్నాయి. ఈ ప్రమాదంలో విమాన రెక్కలు ఊడిపడ్డాయి. అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో ప్రయాణికులతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన తర్వాత పైలట్లను విధుల నుంచి తొలగించాయి.ఈ ఘటనపై వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 10.40 గంటల ప్రాంతంలో ఎయిరిండియా విమానం చెన్నైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. విమానంలో ఆరుగురు క్యాబిన్‌ సిబ్బందితో పాటు 163 మంది ప్రయాణికులు ఉన్నారు. మరో విమానం ఇండిగోకు చెందింది కాగా.. కోల్‌కతా నుంచి దర్భంగాకు వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ విమానంలో ఆరుగురు క్యాబిన్‌ సిబ్బందితో పాటు 149 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ రెండు విమానాలు ఒకేసారి రన్‌వేపైకి వచ్చేశాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని డీజీసీఏ వెల్లడించింది. విచారణ సమయంలో సిబ్బందిని కూడా విచారిస్తామని తెలిపింది.

➡️