నెల్లూరు జిల్లాలో భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర

ఆత్మకూరు : టిడిపి అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో శుక్రవారం కొనసాగుతోంది. చంద్రబాబు అరెస్ట్‌ను తట్టుకోలేక అల్లిపురంలో గుండెపోటుతో మఅతిచెందిన టిడిపి కార్యకర్త కముజుల ఆంజనేయరెడ్డి కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. బాధిత కుటుంబానికి రూ.3లక్షల ఆర్థికసాయం చెక్కును అందజేశారు.

➡️