ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీలు

Jan 3,2024 11:01 #Kanakadurga Temple, #Vijayawada

ప్రజాశక్తి-విజయవాడ: ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ప్రారంభమైంది. దీంతో వివిద జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భవానీలు విజయవాడకు తరలి వస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాల్లో రద్దీ నెలకొంది. భవానీల రద్దీ దృష్ట్యా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. భవానీలు గిరిప్రదక్షిణ చేసి వినాయకుడి గుడి నుంచి దర్శనం క్యూలైన్లో ప్రవేశించేందుకు వీలుగా ట్రాఫిక్‌ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నెల ఏడో తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమానికి సుమారు 5 లక్షల మందికి పైగా దీక్షాధారులు తరలివస్తారని అధికారులు అంచనా.

➡️