పిఎస్‌వికె చలివేంద్రంలో పానకం పంపిణీ

Apr 18,2024 00:07

ప్రజాశక్తి-సత్తెనపల్లి : పట్టణంలోని పాత బస్టాండ్‌ సెంటర్లో పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం (పిఎస్‌వికె) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మజ్జిగ చలివేంద్రంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం పానకం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని పిఎస్‌వికె కన్వీనర్‌ పొట్టి సూర్యప్రకాశరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని దాతలు వంశీ స్పెషాలిటీ హాస్పటల్‌ వైద్యులు డాక్టర్‌ షకీలా శ్రీధర్‌ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు గద్దె చలమయ్య, ఎ.వెంకట్‌నారాయణ, ప్రజాసంఘాల నాయకులు జి.రజని, జి.ఉమాశ్రీ, పి.వీరేశం, టి.రాము, కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు.

➡️