ప్రజాశక్తి – ఎర్రగుంట్ల (కడప) : తిరుపతిలో జరిగిన ఇండియన్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2020 నుండి 24 వరకు విడుదలైన సినిమాలకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఫిలిం అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా 302 సినిమాకుగాను బెస్ట్ యాక్షన్ హీరోగా ఎర్రగుంట్లకు చెందిన ప్రముఖ నటుడు సింగం మహేష్ రెడ్డికి అవార్డు దక్కింది. సింగం మహేష్ కి అవార్డు రావడంతో పట్టణంలోని పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పిసిసి మీడియా అధ్యక్షులు తులసి రెడ్డి మాట్లాడుతూ … ఇద్దరం కలిసి పలు చిత్రాల్లో నటించామని, సింగం మహేష్ కు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో సినీ కళాకారులు, కెమెరామెన్లు, డైరెక్టర్లు, సినీ పరిశ్రమకు సంబంధించిన 24 క్రాప్స్, తదితరులు పాల్గొన్నారు