హైదరాబాద్:శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత సిగరేట్లు భారీగా దొరికాయి. డిటర్జెంట్ పౌడర్ పేరుతో సిగరెట్లను కంటైనర్లో అక్రమంగా తరలిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. ముఠాలోని నలుగురిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారయ్యారని పోలీసులు తెలిపారు. వాటిని బీహార్ నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చినట్లుగా గుర్తించామన్నారు. వాటి విలువ రూ.2.15 కోట్లు ఉంటుందని చెప్పారు. సిగరెట్లతోపాటు డిటర్జెంట్ పౌడర్ను సీజ్ చేశామన్నారు. నింధితులు ఇలియాసుద్దీన్, రవికాంత్ కుమార్, ఎండీ షహజాద్, ముబారిక్ ఖాన్ను అరెస్టు చేశామని, రెహన్ ఖాన్, సుభాష్ పరారయ్యారని చెప్పారు.