రోడ్డు ప్రమాదంలో బ్యాంకు ఉద్యోగి దుర్మరణం

Dec 14,2023 15:05 #medchal malkajgiri, #road accident

మేడ్చల్‌ మల్కాజిగిరి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బైక్‌ను కారు లారీ ఢ కొన్న ఘటనలో ఓ వ్యక్తి మఅతి చెందాడు. ఈ విషాదకర సంఘటన పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి కొంపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు ఎస్‌బీఐలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పని చేస్తున్న వెంకటేష్‌ విధుల్లో భాగంగా ఆఫీస్‌కు వెళ్తుండగా వేగంగా వచ్చిన లారీ అతడి బైక్‌ను ఢ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేష్‌ అక్కడికక్కడే మఅతి చెందాడు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసలు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇటీవలే మఅతుడు అయ్యప్ప మాల వేసుకున్నాడు. వెంకటేష్‌ మఅతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

➡️