ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్ నాసిర్ హొసేన్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) రెండేళ్ల నిషేధం విధించింది. అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఐసిసి నాసిర్పై ఈ ఈ నిషేధం విధించింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం ప్రకటన విడుదల చేసింది. అబుదాబి టి10 లీగ్లో 2020-21 సీజన్లో పుణె డెవిల్స్కు ప్రాతినిథ్యం వహించిన నాసిర్ హుసేన్.. మరో ఏడుగురితో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐసిసి అవినీతి నిరోధక విభాగం సెప్టెంబరు, 2023లో అభియోగాలు నమోదు చేసింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన ఐసిసి అవినీతి నిరోధక విభాగం నాసిర్ తప్పు చేసినట్లు నిర్ధారించింది. నాసిర్ బంగ్లాదేశ్ తరఫున 19టెస్టులు, 65వన్డేలు, 31టి20లు ఆడాడు.