ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : మండల కేంద్రంలోని గ్రామ దేవత శ్రీరావులమ్మ అమ్మవారి జాతర నిర్వహణలో గత కొన్ని ఏళ్లుగా ముందుండి తనదైన శైలిలో పార్టీలకు అతీతంగా అందరి మన్ననలను పొందుతూ జాతరను నడిపిస్తున్న బందా వీర వెంకట సత్యనారాయణమూర్తి విశిష్ట సేవలు ప్రశంసనీయమని ప్రముఖ పారిశ్రామికవేత్తలు వంటిపల్లి పాపారావు, వంటిపల్లి విశ్వనాథం వ్యాఖ్యానించారు. అలాగే కాకతీయ యూత్ ఆధ్వర్యంలో దుశ్శాలువా కప్పి అతని సేవలను కొనియాడుతూ ఘన సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వంటిపల్లి సతీష్, నాతి కుమార్ రాజా, తమ్మి రెడ్డి సాయి తదితర ఆలమూరు ప్రముఖులు, కాకతీయ యూత్ సభ్యులు పాల్గొన్నారు.