ప్రజాశక్తి-అమరావతి: ఈ నెల 29న టిడిపి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి గన్మెన్లను తొలగిస్తూ పోలీసుశాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. బీటెక్ రవికి భద్రత కల్పించాలంటూ డీజీపీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఆయనకు తొలగించిన భద్రతను పునరుద్ధరించాలని కోరారు. 2006 నుంచి ఆయనకు భద్రత ఉందని తెలిపారు. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి కాన్వారుపై దాడి జరిగిన సంఘటనను గుర్తు చేశారు. ఆయనకు ప్రాణ హాని, ఆస్తి నష్టం జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని అచ్చెన్న లేఖలో పేర్కొన్నారు.