తెలంగాణ : తెలంగాణలో బిఆర్ఎస్తో పొత్తుకు బీఎస్సీ అధినేత్రి మాయావతి అంగీకారం తెలిపారు. ఈ మేరకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ దేశంలో ఏ కూటమిలోనూ లేకపోవడంతో, బీఎస్పీకి ఆ పార్టీతో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కలిసి పని చేయడానికి మాయావతి అంగీకరించారని స్పష్టం చేశారు. త్వరలోనే బిఆర్ఎస్ బీఎస్పీ పొత్తు విషయంలో కెసిఆర్ సమక్షంలో జరిగే తదుపరి సమావేశానికి బీఎస్పీ ఎంపీ రాంజీ.. బెహన్ జీ దూతగా హాజరు కానున్నట్లు ఆర్ఎస్పీ పేర్కొన్నారు. ఇటీవల ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని మాయావతి చేసిన వ్యాఖ్యలతో సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే.