బిజెపి తీరు గర్హనీయం

బిజెపి తీరు గర్హనీయం

బిజెపి తీరు గర్హనీయం ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)దశాబ్దాల కాలంగా తిరుమలలో నివాసం ఉంటున్న వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందలేదని, 2019 ఎన్నికల సమయంలో తిరుమల స్థానికుల అవస్థను ప్రత్యక్షంగా పరిశీలించిన భూమన కరుణాకర్‌ రెడ్డి అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి దష్టికి, అసెంబ్లీలో ప్రస్తావించి తిరుమల స్థానికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించారని తిరుమల వైసిపి యువ నాయకులు శ్రీనివాసులు యాదవ్‌ స్పష్టం చేశారు. బిజెపి తీరు గర్హనీయమన్నారు. శుక్రవారం తిరుపతి ప్రెస్‌ క్లబ్‌ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019లో తిరుపతి టిటిడి పరిపాలన భవనం వద్ద తిరుమలలోని స్థానికులు అందరూ సమస్యలను ఏ కరువు పెడుతూ రోడ్డుపై నిరసన చేపట్టామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దశాబ్దాల కాలంగా తిరుమల స్థానికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి పరిష్కారాలు చూపారన్నారు. తిరుమలలోనూ సచివాలయ నిర్మాణానికి నాంది పలికారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌విసురేష్‌, చిన్నముని, చందురాయల్‌ పాల్గొన్నారు.

➡️