అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన బీజేపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌ : అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభం కాగా బీజేపీ ఎమ్మెల్యేలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అక్బరుద్దీన్‌ ఎదుట ప్రమాణ స్వీకారం చేసేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు నిరాకరించారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. అంతకు ముందు బీజేపీ ఎమ్మెల్యేలంతా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డితో సమావేశం అయ్యారు. అనంతరం వారంతా భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు.

➡️