దేశద్రోహులు బిజెపి నాయకులు : సిపిఎం

ప్రజాశక్తి-మంగళగిరి : దేశద్రోహులు బిజెపి నాయకులని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. శనివారం మంగళగిరిలో సిఏఏ ను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సిపిఎం కార్యాలయం నుండి పాత పాత బస్టాండ్ వరకు ప్రదర్శన నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ బిజెపి పార్టీ సిఏఏను తీసుకువచ్చి ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు పూనుకుందని విమర్శించారు. లౌకిక రాజ్యానికి బిజెపి ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో వైసిపి, టిడిపి పార్టీలు సిఏఏ పై మాట్లాడటం లేదని అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సి ఏ ఏ ను సమర్థిస్తూ మాట్లాడడం దారుణమని అన్నారు. రానున్న ఎన్నికల్లో బిజెపికి తొత్తులుగా ఎవరిస్తున్న వైసిపి, టిడిపిలను ఓడించాలని పిలుపునిచ్చారు. దేశ సమైక్యతను సమగ్రతను కాపాడటానికి ప్రజలు పూనుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి కృష్ణయ్య, ఎం సూర్యారావు, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈమని అప్పారావు, వై నేతాజీ, కే నలిని కాంత్, ఎం రవి, ఎన్ భవన్ నారాయణ, ఎస్ ఎస్ చంగయ్య, సిపిఎం సీనియర్ నాయకులు జొన్న శివశంకరరావు, సిపిఎం మంగళగిరి పట్టణ కార్యదర్శి వై కమలాకర్, తాడేపల్లి మండల కార్యదర్శి డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️