ఇండియా-ఎ జట్టును ప్రకటించిన బిసిసిఐ

Jan 20,2024 22:08 #Sports

ఇంగ్లండ్‌ లయన్స్‌తో మూడురోజుల మ్యాచ్‌

ముంబయి: ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరిగే మూడురోజుల సిరీస్‌కు ఇండియాాఎ జట్టును భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) జట్టును ప్రకటించింది. ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరిగే రెండు, మూడు రోజుల మ్యాచ్‌కు ఇండియాాఎ జట్టు అభిమన్యు ఈశ్వరన్‌ సారథిగా వ్యవహించనున్నాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ కేవలం రెండో మ్యాచ్‌కు అందుబాటులో ఉండనుండగా.. మూడో మ్యాచ్‌కు అతడు దూరం కానున్నాడు. అతని స్థానంలో రింకు సింగ్‌ జట్టులో చేరనున్నాడు. కుమార్‌ కుషగ్రకు తొలిసారి ఇండియాాఎ తరఫున పిలుపు వచ్చింది. అతడు ఇంగ్లండ్‌తో రెండు మ్యాచ్‌ల్లోనూ ఆడనున్నాడు. తొలి మ్యాచ్‌లో ఇండియాాఎ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌-ఎను చిత్తు చేసింది.

2వ టెస్ట్‌కు: అభిమన్యు ఈశ్వరన్‌(కెప్టెన్‌), సాయి సుదర్శన్‌, పటీథర్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, తిలక్‌ వర్మ, కుమార్‌ కుషగ్ర, సుందర్‌, సౌరభ్‌ కుమార్‌, ఆర్ష్‌దీప్‌ సింగ్‌, తుషార్‌ దేశ్‌పాండే, కావేరప్ప, ఉపేంద్ర యాదవ్‌, ఆకాశ్‌ దీప్‌, యశ్‌ దయాల్‌.3వ టెస్ట్‌కు: అభిమన్యు ఈశ్వరన్‌(కెప్టెన్‌), సాయి సుదర్శన్‌, పటీథర్‌, తిలక్‌ వర్మ, కుమార్‌ కుషగ్ర, సుందర్‌, రింకు సింగ్‌, షామ్స్‌ ములానీ, ఆర్ష్‌దీప్‌ సింగ్‌, తుషార్‌ దేశ్‌పాండే, కావేరప్ప, ఉపేంద్ర యాదవ్‌, ఆకాశ్‌ దీప్‌, యశ్‌ దయాల్‌.

➡️