బీసీలు అంతా జగన్ వెంటే

Feb 3,2024 12:42 #East Godavari
bc cell leader satyagiri on bc welfare

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : బీసీలంతా జగన్ అంటే అని తూర్పుగోదావరి జిల్లా బీ.సీ సెల్ కార్యదర్శి డాక్టర్ చొల్లంగి సత్యగిరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సత్యగిరి మాట్లాడుతూ బీసీలు అంతా జగన్ వెంటే ఉంటారని ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటివరకు బీసీల పార్టీ అని చెప్పుకుని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బీసీలను ఎప్పుడు కులవృత్తులు చేసుకునే వ్యక్తులు లాగానే చూశారని కానీ వైయస్ జగన్ మాత్రమే మొట్టమొదటిసారిగా బీసీలకు పెద్దపీట వేసి అధిక సంఖ్యలో బీసీలను రాజ్యాధికారం దిశగా నడిపిస్తున్న వ్యక్తి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్ మాత్రమే మొట్టమొదటిసారిగా అధిక సంఖ్యలో రాజ్యసభ (పెద్దల సభ )కు పంపిన వ్యక్తి కూడా వైఎస్ జగన్ అని తెలిపారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అత్యంత చరిత్ర కలిగిన సాంస్కృతిక, పర్యాటక కేంద్రం గా వెలసిల్లుతున్న రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానాన్ని గత సార్వత్రిక లోక్సభ ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన సంగతి విధితమే. అదే విధంగా ఈసారి కూడా బీసీలకు కేటాయించి బీసీల పట్ల తనకున్న చిత్తశుద్ధిని, ప్రేమను సీఎం జగన్ మరోసారి చాటుకున్నారని తూర్పుగోదావరి జిల్లా బీసీ సెల్ కార్యదర్శి డాక్టర్ చోల్లంగి. సత్యగిరి పేర్కొన్నారు.

➡️