వర్థంతి సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం
ప్రజాశక్తి – భీమవరం
సిపిఎం అగ్రనేత మాకినేని బసవపున్నయ్య ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేసి నేటితరం కార్యకర్తలంతా ఆయన చూపిన బాటలో పని చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం పిలుపునిచ్చారు. స్థానిక సుందరయ్య భవనం వద్ద మాకినేని బసవపున్నయ్య వర్థంతి సభ శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బసవపున్నయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బలరాం మాట్లా డుతూ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో, స్వాతంత్రం అనం తరం భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీని నిర్మించడంలో మాకి నేని బసవ పున్నయ్య పాత్ర ఎనలేనిదని కొనియాడరు. ఆ రోజు ల్లో కమ్యూనిస్టు పార్టీ ఒడిదుడుకులు ఎదుర్కొన్న సమయంలో కార్మికవర్గ రాజ్యం కోసం నికార్శైన కమ్యూనిస్టు పార్టీని నెలకొల్పాలని భావించిన కొద్దిమంది నేతల్లో మాకినేని బసవ పున్నయ్య ఒకరని తెలిపారు. బసవ పున్నయ్య ఆ రోజుల్లో దళితు లను అంటరానివారుగా చూడటాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిం చారన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బసవపున్నయ్య చూపిన బాటలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జెఎన్వి.గోపాలన్, బి.వాసు దేవరావు, నాయకులు ఎం.వైకుంఠరావు, ధనికొండ శ్రీనివాస్, ఎం.ఆంజనేయులు, రత్నకుమారి, మణి, రాము పాల్గొన్నారు.