ప్రజాశక్తి – సామర్లకోట
‘వారెవ్వా జత గాళ్లు’ చిత్రానికి స్పెషల్ జ్యూరీ అవార్డు రావడం సంతోషంగా ఉందని చిత్రం డైరెక్టర్ సలాది సత్య, హీరో పిట్టా కృష్ణ అన్నారు. సామర్లకోట మండలానికి చెంది న ఈ చిత్రం డైరెక్టర్, హీరోలు సోమవారం స్థానిక మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విజయవాడ హ్యాపీ రిసార్ట్స్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఫిలిం చాంబార్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఉగాది సినిమా పురస్కార అవార్డ్స్లో తమ చిత్రానికి స్పెషల్ జూరీ అవార్డును సీనియర్ నిర్మాత ఎఎం.రత్నం, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజరు గౌస్, బలగం డైరెక్టర్ వేణు, ఫిలిం ఛాంబర్ పెద్దలు అంబటి మధుమోహన్ కృష్ణ, మోహన్ గౌడ్ తదితరుల ఈ అవార్డును అందుకున్నట్లు తెలిపారు. స్థానిక నటి నటులతో నిర్మించిన ‘వారెవ్వా జత గాళ్ళు’ చిత్రానికి పనిచేసిన నటీ నటులు, టెక్నీ షియన్స్, అసిస్టెంట్ డైరెక్టర్లు, నిర్మాతలు గరగ వీరబాబు, బండారు నాగబాబు, దొడ్డి వీర ప్రభాకర్ల కష్టానికి ప్రతిఫలం దక్కింద న్నారు. మా మొదటి సినిమా ధియేటర్ వరకు రావడం, 8 రోజులు థియేటర్లో ప్రదర్శించబడటం గొప్ప విజ యంగా భావిస్తున్నామన్నారు. ఈ ప్రోత్సాహక అవార్డు రావడం వల్ల భవిష్యత్తులో స్థానికంగా టాలెంట్ ఉన్న మరింత మంది నూతన కళాకారులను వెండితెరకు పరిచయం చేయాలనే మా లక్ష్యం నెరవేరడానికి ఒక మానసిక ధైర్యాన్ని ఈ అవార్డు ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.