అవంతి కాలేజ్ బస్సు బీభత్సం

బాలుడు మృతి
ప్రజాశక్తి – కశింకోట : ఆనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం హెరిటేజ్ పాల ఫ్యాక్టరీ సమీపంలో జాతీయ రహదారి  పక్కన ఉన్న టిఫిన్ వాహనంపైకి అవంతి ఇంజనీరింగ్ కాలేజీ బస్సు శుక్రవారం ఉదయం దూసుకు వచ్చి బీభత్సం సృష్టించింది. ముస్లిం కుటుంబానికి చెందిన  గౌస్(12) అనే బాలుడు మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో క్షతగాత్రులు అనకాపల్లి వంద పడకల ఆసుపత్రికి తరలించారు. పెందుర్తి నుండి పిఠాపురం కారులో వెళ్తూ టిఫిన్ చేసేందుకు బయ్యవరం వద్ద ఆగిన ముస్లిం కుటుంబం రంజాన్  మరుసటి రోజే ప్రమాదం జరగడంతో గుండెలవిసేలా మృతుని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కసింకోట సీఐ వినోద్ బాబు, పోలీసులు ఘటన విచారణ చేస్తున్నారు.

➡️