- సెల్ఫీ తీసుకుంటుండగా కత్తి తీసిన నిందితుడు
- అడ్డుకున్న కార్యకర్తలు – పోలీసులకు అప్పగింత
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి కూటమి అభ్యర్థి బొజ్జల వెంకటసుధీర్రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. సెల్ఫీ తీసుకునేందుకు వచ్చిన వ్యక్తి తన వద్ద ఉన్న కత్తిని ఒక్కసారిగా బయటకు తీశాడు. దాడియత్నాన్ని వెంటనే కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సంఘటన శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది. టిడిపి నాయకుల సమాచారం మేరకు.. గురువారం ఉదయం శ్రీకాళహస్తిలోని ఐదవ వార్డులో బొజ్జల వెంకటసుధీర్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా మహేష్ కుమార్ (35) అనే వ్యక్తి అక్కడకు చేరకున్నాడు. వెంకటసుధీర్ రెడ్డితో సెల్ఫీ కావాలని స్థానిక టిడిపి నాయకులను కోరాడు. అందుకు వారు అంగీకరించడంతో వెంకటసుధీర్రెడ్డితో సెల్ఫీ తీసుకుంటుండగా తన జేబులో దాచుకున్న కత్తిని మహేష్కుమార్ బయటకు తీశాడు. గమనించిన టిడిపి కార్యకర్తలు వెంటనే ఆ కత్తిని లాక్కున్ని దాడి చేయకుండా అడ్డుకున్నారు. మహేష్ను శ్రీకాళహస్తి రెండవ పట్టణ పోలీసులకు అప్పగించారు. దాడికి యత్నించిన మహేష్ కుమార్ వైసిపి కార్యకర్త అని వెంకటసుధీర్ రెడ్డి మీడియా ఎదుట ఆరోపించారు. కత్తితో తిరుగుతూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేసినట్లుగా నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చంద్రగిరికి చెందిన మహేష్ తిరుమల ఆర్టిసి డిపోలో మెకానిక్గా పనిచేస్తున్నాడని స్థానికులు తెలిపారు.