రాహుల్‌గాంధీపై కేసు సిఐడికి బదిలీ

Jan 25,2024 11:29 #CID, #Rahul Gandhi

 గువహటి :    కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ఆయన సహచరులపై నమోదైన కేసును సిఐడికి బదిలీ చేసినట్లు అస్సాం పోలీసులు గురువారం తెలిపారు. సమగ్రమైన, లోతైన దర్యాప్తు కోసం ఈ కేసును సిఐడికి బదిలీ చేస్తున్నట్లు అస్సాం పోలీస్‌ చీఫ్‌ జిపి.సింగ్‌ ఎక్స్‌లో తెలిపారు. రాహుల్‌ గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్‌ నేతలపై అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశాలు, నేరపూరిత కుట్రకు సంబంధించి ఐపిసిలోని తొమ్మిది సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసు రాహుల్‌గాంధీ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మల మధ్య తీవ్రమైన మాటలయుద్ధానికి దారితీసింది.

రెండు రోజుల క్రితం అస్సాం రాజధాని గువహటికి పట్టణ పరిధిలో రాహుల్‌ చేపడుతున్న భారత్‌ జోడో న్యాయ్  యాత్రలో పార్టీ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ చెలరేగిన సంగతి తెలిసిందే. ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడే అవకాశం ఉందని ఆరోపిస్తూ హిమంత బిస్వాశర్మ ప్రభుత్వం గువహటి రోడ్లపై యాత్రను అనుమతించేందుకు నిరాకరించింది. అనుమతి నిరాకరించడం సరికాదంటూ కాంగ్రెస్‌ నేతలు నగరంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం నెలకొంది.

➡️