Asian Badminton Championship : ప్రి క్వార్టర్స్‌కు సింధు

Apr 10,2024 22:21 #Badminton, #Sports

నింగ్బో(చైనా): ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. మహిళల సింగిల్స్‌లో పివి సింధు శుభారంభం చేయగా.. పురుషుల సింగిల్స్‌లో స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ ఓటమిపాలయ్యాడు. బుధవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో సింధు వరుససెట్లలో మలేషియా షట్లర్‌ను చిత్తుచేసింది. హోరాహోరీగా సాగిన ఈమ్యాచ్‌లో సింధు 21-18, 14-21, 21-19తో మలేషియాకు చెందిన 33వ ర్యాంకర్‌ గో-జిన్‌-వురును ఓడించింది. ఈ మ్యాచ్‌ సుమారు 64నిమిషాలసేపు హోరాహోరీగా సాగింది. ప్రి క్వార్టర్స్‌లో సింధు 6వ సీడ్‌ చైనాకు చెందిన హన్‌-వురుతో క్వార్టర్స్‌ బెర్త్‌కు పోటీపడనుంది. ఇక పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌ పోరాటం ముగిసింది. మహిళల డబుల్స్‌లో గాయత్రి-త్రీసా జోలీ 2-21, 11-21తో 4వ సీడ్‌ చైనా షట్లర్ల చేతిలో ఓడారు.

➡️