ఆశా వర్కర్ల రాస్తారోకో : జిబిసి రోడ్లో నిలిచిపోయిన ట్రాఫిక్

Feb 8,2024 23:09

ప్రజాశక్తి – బాపట్ల
ఆశాలు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లనియకుండా అడ్డుకొని పోలీస్ స్టేషన్లో నిర్భందించడంతో గురువారం ఆశా కార్యకర్తలు బాపట్లలో రాస్తారోకో చేశారు. ఆశా వర్కర్లను గృహ నిర్బంధం చేసి విజయవాడకు వెళ్ళనీయకుండా పలువురు ఆశా కార్యకర్తలను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆశాలు పోలీస్ స్టేషన్లో నిర్భందించిన ఆశాలను విడుదల చేయాలని కోరుతూ పట్టణంలో రాస్తారోకో చేశారు. జిబిసి రోడ్డులో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగిందని సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆశాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విజయవాడ వెళ్ళబోమని వారి వద్ద నుండి లిఖితపూర్వక హామీ తీసుకొని సాయంత్రం వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళాలనే షరతుపై ఆశావర్కర్లను విడుదల చేశారు.

➡️