అరుణాచల్ ప్రదేశ్ : అరుణాచల్ ప్రదేశ్లో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రెండు గంటల వ్యవధిలో రెండు భూకంపాలు నమోదు అయ్యాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. మొదటి భూకంపం 3.7 తీవ్రతతో ఉదయం 01:49 గంటలకు సంభవించగా, ఉదయం 03:40 గంటలకు రెండవ భూకంపం సంభవించినట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఇండియా నేషనల్ సెంటర్ ఎక్స్ లో చేసిన పోస్ట్లో తెలిపింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ప్రాణనష్టం జరగలేదని నివేదికలు తెలిపాయి. అరుణాచల్ ప్రదేశ్లోని పశ్చిమ కమెంగ్లో భూకంపం కేంద్రీకృతమై ఉంది.