ఓటు హక్కు వినియోగంపై కళారూపాలు

ప్రజాశక్తి-విఆర్ పురం : అల్లూరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సేఫ్ యాక్టివిటీలో భాగంగా శనివారం మండల కేంద్రం రేకపల్లి సెంటర్లో పాడేరుకు చెందిన రాజారాం జయరాం వారిచే కళా జాతను నృత్య ప్రదర్శనలను నిర్వహించారు. తాసిల్దార్ మౌలానా పాజిల్ ఆధ్వర్యంలో ఈ కళారూపాలు నిర్వహించారు. అందరూ ఓటును సక్రమంగా వినియోగించుకోవాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమం ద్వారా కళాకారులు వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ప్రజలు వివిధ శాఖల అధికారులు రెవెన్యూ అధికారులు వీఆర్వోస్ వీఆర్ఏలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️