విజయవాడ : గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ ప్రతినిధుల కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. గతంలో ప్రసాదంపాడులో జరిగిన ఓ ఘటనపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు కోర్టుకు హాజరుకాకపోవడంతో వంశీకి కోర్టు వారెంట్ జారీ చేసింది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రసాదంపాడులోని ఓ పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఘటనలో.. మొత్తం 38 మందిపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. కేసు విచారణకు కోర్టుకు హాజరుకాకపోవటంతో బెయిలబుల్ వారెంట్ను గత విచారణలోనే న్యాయస్థానం జారీ చేసింది. ఈరోజు విచారణకూ హాజరుకాకపోవటంతో వారెంట్ అమలు చేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది.