బొప్పూడి సభకు ఏర్పాట్లు

Mar 15,2024 15:04 #meeting, #palanadu, #tdp -janasena

ప్రజాశక్తి-బొప్పూడి : పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మండలంలో బొప్పూడిలో టిడిపి-జనసేన-బిజెపి కూటమి సభ ఏర్పాట్లు ముమ్మరంగా  జరుగుతున్నాయి. యువనేత నారా లోకేష్ నేతృత్వాన 13కమిటీల సభ్యులు నిర్విరామంగా ఏర్పాట్లలో నిమగ్నమైన్నారు. ప్రధాని నరేంద్రమోడీ హాజరు కానుండటంతో బ్లూబుక్‌ భద్రత నిబంధనల మేరకు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఎస్పీజి అధికారుల బృందం సభా ప్రాంగణంలోనే ఉండి నాయకులకు సూచనలిస్తున్నారు. ప్రధాని మోడీ, టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం 3హెలీప్యాడ్లను నిర్వాహకులు సిద్దం చేస్తున్నారు.  10లక్షల మంది వస్తారన్న అంచనాతో బొప్పూడి సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం రాత్రికల్లా సభా ప్రాంగణాన్ని తమకు అప్పగించాలని భద్రతాసిబ్బంది నాయకులకు సూచించారు. జగన్ ను ఓడించమే కూటమి లక్ష్యమంటున్న టిడిపి-జనసేన-బిజెపి నాయకులు పేర్కొంటున్నారు.

➡️