- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
ప్రజాశక్తి-విజయవాడ : ఆసుపత్రులకు ఇవ్వాల్సిన రూ.1400 కోట్ల ఆరోగ్య శ్రీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మార్చి 18 నుండి నెట్ వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపి వేయకుండా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కోరారు. ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోతే పేద ప్రజలకి అందే వైద్యం ఆగిపోతుందని ఆయన పేర్కొన్నారు.