నేటి నుంచి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఏప్రిల్‌ కోటా విడుదల

Jan 18,2024 10:41 #Tirupati district, #ttd

ప్రజాశక్తి – తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, టికెట్ల దర్శన కోటాను విడుదల చేయనున్నట్లు టిటిడి తెలిపింది. ఏప్రిల్‌ నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ కోసం జనవరి 18 నుండి 20వ తేదీ ఉదయం పది గంటల వరకు నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. లక్కీడిప్‌లో టికెట్లు పొందినవారు 22న మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి సూచించింది. శ్రీవారి వార్షిక వసంతోత్సవం ఏప్రిల్‌ 21 నుండి 23వ తేదీ వరకు జరగనుందని తెలిపింది.

➡️