‘అది’ తప్ప మోదీ చేసిందేమీ లేదు : సిఎం స్టాలిన్

చెన్నై : కుటుంబంలా జీవిస్తున్న భారతదేశ ప్రజలను మతం పేరుతో విభజించడం తప్ప ప్రధాని నరేంద్ర మోదీ చేసిందేమీ లేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. మదురై లోక్‌సభ అభ్యర్థి ఎస్‌.వెంకటేశన్, శివగంగ అభ్యర్థి కార్తీ చిదంబరం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఏళ్ల తరబడి మౌనం వహించిన నరేంద్ర మోదీ ఇప్పుడు మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బిల్కిస్ బాను అత్యాచారం కేసులో నిందితులు నిర్దోషులుగా విడుదలైనప్పుడు, రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదు వచ్చినప్పుడు మోదీ మౌనంగా ఉన్నారని తెలిపారు. మణిపూర్‌లో మహిళలపై లైంగిక వేధింపులు జరిగినప్పుడు, బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ అత్యాచారం కేసులో నిందితుడైనప్పుడు, ఉన్నావ్, హత్రాస్ ఘటనల్లో బాధితురాలి కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు కూడా మోదీ మౌనంగానే ఉన్నారని ఆగ్రహించారు. కుటుంబంలా జీవిస్తున్న ప్రజలను మతం పేరుతో విభజించడం తప్ప నరేంద్ర మోదీ చేసిందేమీ లేదని స్టాలిన్ విమర్శించారు.

➡️