ఐసిస్‌ నెట్‌వర్క్‌ కేసులో ఎన్‌ఐఎ దాడులు

న్యూఢిల్లీ : ఐసిస్‌ (ఐఎస్‌ఐఎస్‌) నెట్‌వర్క్‌ కేసుకు సంబంధించి ఉగ్రవాద నిరోధక సంస్థ (ఎన్‌ఐఎ) నాలుగు రాష్ట్రాల్లోని 19 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. సోమవారం ఉదయం నుండి ఎన్‌ఐఎ   దాడులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.  కర్ణాటకలోని 11 ప్రాంతాలు, జార్ఖండ్‌లో నాలుగు, మహారాష్ట్రలోని మూడు ప్రాంతాల్లో, ఢిల్లీలో దాడులు జరుగుతున్నాయి.   గతవారం సెంట్రల్‌ యాంటీ టెర్రర్‌ ఏజన్సీ మహారాష్ట్రలోని 40 ప్రాంతాల్లో దాడులు చేసి 15 మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

➡️