న్యూఢిల్లీ : న్యూస్ పోర్టల్ న్యూస్క్లిక్పై విచారణ పూర్తి చేసేందుకు ఢిల్లీ పోలీసులకు మరో 60 రోజుల సమయానికి కోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. అలాగే న్యూస్క్లిక్ ప్రధాన సంపాదకులు ప్రబీర్ పుర్కాయస్తా, హచ్ఆర్ విభాగం చీఫ్ అమిత్ చక్రవర్తిలకు జ్యుడిషియల్ కస్టడీని జనవరి 20 వరకూ కోర్టు పొడిగించింది. ప్రత్యేక జడ్జి హర్దీప్ కౌర్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. న్యూస్క్లిక్పై దర్యాప్తు పూర్తి చేసేందుకు మరికొంత సమయం కావాలని ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటీషన్పై శుక్రవారం కోర్టు విచారణ చేసింది. పుర్కాయస్తా, అమిత్ చక్రవర్తిలను ఢిల్లీ పోలీసులకు చెందిన ప్రత్యేక విభాగం అక్టోబర్3న అరెస్టు చేసింది. న్యూస్క్లిక్పై ఉపా చట్టం కింద కేసులును నమోదు చేసింది. కాగా, కేంద్ర ఆదాయపన్ను శాఖ ఇటీవల న్యూస్క్లిక్ బ్యాంక్ ఖాతాలను స్థంభింప చేసింది.