పతంజలిశాస్త్రికి సాహిత్య అకాడమీ పురస్కారం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:ప్రముఖ రచయిత తల్లావజ్జల పతంజలిశాస్త్రికి ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. తెలుగులో ఆయన రాసిన ‘రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు’ (షార్ట్‌ స్టోరీస్‌) గానూ ఈ పురస్కారం లభించింది. 2023 సంవత్సరానికి గాను బుధవారం రం సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించింది. మొత్తం 24 భాషల్లో అవార్డులు ప్రకటించగా… ఇందులో 9 కవిత్వం, 6 నవలలు, 5 షార్ట్‌ స్టోరీస్‌, 3 వ్యాసాలు, ఒక సాహిత్య అధ్యాయనానికి పురస్కారాలు ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 12 ఢిల్లీలోని కోపర్నికస్‌ మార్గ్‌లోని కమాని ఆడిటోరియంలో ఈ పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. విజేతలకు రూ.లక్ష నగదు, తామ్ర పత్రం అందించనున్నారు.

➡️