మైలవరం (ఎన్టిఆర్) : మంత్రి ఉషా శ్రీ చరణ్ అంగన్వాడీల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ … మైలవరంలోని అంగన్వాడీలు ఆమె చిత్రపటానికి చెప్పుల దండలు వేసి నిరసన తెలిపారు. మంత్రి ఉష శ్రీ చరణ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. గత గురువారం ఎపి మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ … అంగన్వాడీలు ఉద్యోగ విరమణ చేసిన తరువాత గంజితాగడానికైనా వీలుగా గ్రాట్యుటీని ఇవ్వాలన్న కోరికను సైతం తమ పరిధిలోనిది కాదంటూ తిరస్కరించారు. జీతాలు పెంచకపోయినా సమ్మెను విరమించాలని అంగన్వాడీలను కోరిన సంగతి విదితమే.