ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేర్చారు. ఆ ఆసుపత్రి వైద్యులు అమితాబ్కి ఆంజియోప్లాస్టీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ సమాచారానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఆంజియోప్లాస్టీ జరిగిందని.. ప్రస్తుతం అమితాబ్ కోలుకుంటున్నారని పలు నివేదికలు పేర్కొన్నాయి. అయతే బిగ్బీ సోషల్మీడియాలో యాక్టివ్గానే ఉన్నారు. తాజాగా ఆయన ‘ఎప్పటికీ కృతజ్ఞతతో’ ఉంటా’ అని రాసుకొచ్చారు. బహుశా తన అనారోగ్యానికి సంబంధించిన విషయాన్ని అభిమానులకు తెలియజేయడానికే అమితాబ్ ఇలా పోస్టు పెట్టి ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.