విద్యుత్‌ బిల్లు సవరణ

Apr 9,2024 21:08

 ప్రజాశక్తి – నెల్లిమర్ల : మండల ంలోని కొండగుంపాం గ్రామానికి చెందిన విద్యుత్‌ బిల్లు సవరించినట్లు ఎఇ పిచ్చయ్య తెలిపారు. మంగళవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ కొండగుంపాం గ్రామానికి చెందిన సతివాడ రాములమ్మకు ఇటీవల రూ.44,718 విద్యుత్‌ బిల్లు రావడంతో ఆమె ఆందోళనకు గుర య్యారు. ఈ నేపథ్యంలో పలు పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. దీనికి స్పందించిన ఎఇ మంగళవారం పరిశీలించి విద్యుత్తు బిల్లును సవరించి రూ. 64 బిల్లును తిరిగి జారీ చేసినట్లు తెలిపారు. మీటర్‌లో సాంకేతిక కారణంగా కొన్ని సందర్భాల్లో బిల్లు అధిక మొత్తంలో చూపెడుతుందని తెలిపారు. అధిక మొత్తంలో వచ్చిన విద్యుత్‌ బిల్లును అన్ని విధాల తనిఖీలు చేసి సవరించి తిరిగి ఇచ్చిటన్లు ఎఇ పిచ్చయ్య తెలిపారు.

➡️