దున్నపోతుకు వినతిపత్రం

Dec 17,2023 17:31 #Guntur District
gnt aganwadi workers strike 6th day key2

ప్రజాశక్తి – తుళ్లూరు : రాజధాని రైతులు వినూత్నంగా దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చారు. ముఖ్యమంత్రిని దున్నపోతుగా అభివర్ణిస్తూ వినతిపత్రాన్ని మెడకు కట్టారు.అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసి ఆదివారంతో నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా తుళ్లూరు రైతు దీక్షా శిబిరం వద్ద రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వానికి ఎన్ని విన్నపాలు చేసినా దున్నపోతు మీద చినుకులు పడిన చందంగా ఉందంటూ నిరసన వ్యక్తం చేశారు. దున్నపోతు మీద జగన్ చిత్రపటాన్ని ఉంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

➡️