32 ఏళ్ల తర్వాత రజనీ సినిమాలో శోభన

‘దళపతి’ చిత్రం కాంబో రిపీట్‌ కానుంది. మణిరత్నం దర్శకత్వంలో రజనీకాంత్‌, మమ్ముట్టి, అరవిందస్వామి కలిసి నటించిన చిత్రమిది. శోభన కథానాయిక. 1988లో ఈ సినిమా విడుదలై ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘కళుగు’. ఈ చిత్రం టైటిల్‌ ఈనెల 22న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో శోభన నటించనుంది. దళపతి తర్వాత రజనీతో కలిసి ఆమె నటించే చిత్రమిదే కావటం విశేషం.

➡️