ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : ఆదోని అరుణ్ జ్యోతి నగర్ కాలనీ ఫిలిప్స్ కబాడీ టీం క్రీడాకారుడు బి అరుణ్ కుమార్ రాష్ట్ర స్థాయి కబాడీ పోటీలకు ఎంపికైనట్లు ఆదోని ఫిలిప్స్ కబడ్డీ అసోసియేషన్ సభ్యులు అమర్ ప్రకాష్, రామాంజి, జయరాం, గోపి, నాగరాజు, రవి, గోవింద రాజు సోమవారం ఆదోనిలో విలేకరులకు తెలిపారు. కర్నూల్లో ఇటీవల జరిగిన ఎంపిక పోటీలలో అరుణ్ కుమార్ ప్రతిభ కనబరిచారు అన్నారు. 70వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు వచ్చే నెల మార్చి 8 నుండి 10వ తేదీ వరకు నెల్లూరు జిల్లా కొవ్వూరులో జరుగుతాయన్నారు. అరుణ్ కుమార్కు అభినందనలు తెలుపుతూ ఎంపికకు కఅషి చేసిన జిల్లా సెక్రటరీ సుభకర్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు.