రేవంత్‌ రెడ్డి పిటిషన్‌పై విచారణ వాయిదా

Jan 6,2024 10:35 #Case, #revanth reddy

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:ఓటుకు నోటు కేసును విచారించే ట్రయల్‌ కోర్టు పరిధిని సవాలు చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు సంజీవ్‌ ఖన్నా, దీపాంకర్‌ దత్తాతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. న్యాయవాది-ఆన్‌-రికార్డ్‌లోని కుటుంబ సభ్యుని మరణం కారణంగా విచారణను వాయిదా వేయడానికి ధర్మాసనం అంగీకరించింది. ఈ పిటిషన్‌ను నాలుగు వారాల తరువాత విచారించనుంది.

➡️