వరుస హిట్లతో పాన్ ఇండియా ఫేమ్ సంపాదించిన అడివి శేష్, తన అప్ కమింగ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా #SeshExShruti కోసం హీరోయిన్ శృతి హాసన్తో జతకట్టనున్నారు. హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా, అమెరికాలో పుట్టి పెరిగిన షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు.ఒక్కో పోస్టర్తో క్యురియాసిటీ మరింతగా పెరుగుతోంది! ఈ చిత్రం నుండి శృతి హాసన్ ఫస్ట్ గ్లింప్స్ శనివారం విడుదల చేశారు.
ఈ తాజా పోస్టర్లో,శృతి హసన్ తన కళ్ళలో కోపం, ఆవేశాన్ని వ్యక్తం చేస్తూ, ఇంటెన్స్ ఎమోషన్స్ తో ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ఈ సినిమా టైటిల్ను డిసెంబర్ 18న అనౌన్స్ చేస్తామని మేకర్స్ తెలిపారు. అడివి శేష్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో శృతి హాసన్ పోస్టర్ ని పంచుకున్నారు. ”ఆమె కళ్లలో కోపాన్ని చూడండి! టైటిల్, ఫస్ట్ లుక్ డిసెంబర్ 18న విడుదల. SeshEXShruti. @shrutzhaasanతో కలిసి పని చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. బ్యుటీఫుల్ హార్ట్. బ్యుటీఫుల్ సోల్. అద్భుతమైన కెమిస్ట్రీ కోసం ఎదురు చూస్తున్నాను” అని రాశారు. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.